మరో 20 ఏళ్లు మాదే అధికారం: అమిత్ షా

3 Apr, 2015 15:13 IST|Sakshi
మరో 20 ఏళ్లు మాదే అధికారం: అమిత్ షా

బెంగళూరు: తమ పార్టీ దేశాన్ని మరో 20 ఏళ్లు పరిపాలిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బెంగళూరులో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. 'మన పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ మరో 10 నుంచి 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది' అని అమిత్ షా చెప్పినట్టు పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు, పది నెలల పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతల గురించి కూడా తన ప్రసంగంలో అమిత్ షా ప్రస్తావించారు. నూతన రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చామని, విధాన వైఫల్యాలకు చరమగీతం పాడామని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు