సీఎం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుంది: అమిత్ షా

19 Oct, 2015 12:43 IST|Sakshi
సీఎం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుంది: అమిత్ షా

పాట్నా: బిహార్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల అనంతరం పార్టీ నిర్ణయిస్తుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టంచేశారు. సోమవారం పాట్నాలో  ఆయన మాట్లడుతూ.. బిహార్ ప్రజలు బీజేపీతో ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు.

 

బిహార్ ప్రజలు అభివృద్ది కోసం బీజేపీ వైపు చూస్తున్నారనీ.. మరోసారి జంగిల్ రాజ్-2 ను కోరుకోవడంలేదని నితీష్ కుమార్ పాలనను విమర్శించారు. భారతీయ జనతాపార్టీ దళితులకు రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకించడం లేదనీ.. ఈ విషయంపై ప్రతి పక్షాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయని అన్నారు.

మరిన్ని వార్తలు