వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద శనివారం రాత్రి బాంబు బెదిరింపు కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి సమయంలో కారులో వచ్చిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది చెక్పాయింట్ వద్ద నిలువరించారు. అయితే, తన కారులో బాంబు ఉందని, తనను వైట్హౌస్లోకి అనుమతించాలని సదరు వ్యక్తి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన భద్రతాసిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు.
శనివారం రాత్రి 11.05 సమయంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అంతేకాకుండా అతని వాహనాన్ని అనుమానాస్పదంగా భావించి స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటన నేపథ్యంలో వైట్హౌస్ వద్ద భద్రతాదళాల సంసిద్ధతను మరింత పెంచామని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. అయితే, సదరు వ్యక్తి వాహనంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని కస్టడీలోకి తీసుకొని భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నది. అతని వద్ద ఏమైనా పేలుడు పదార్థాలు లభించాయా? అన్నదానిపై భద్రతా సిబ్బంది ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.