-

పరీక్ష రాస్తున్న నేహా వద్దకు వచ్చి..!

21 Jul, 2016 17:26 IST|Sakshi
పరీక్ష రాస్తున్న నేహా వద్దకు వచ్చి..!

అలీగఢ్ (ఉత్తరప్రదేశ్): వర్షకాలం కావడంతో వాతావరణం కొంచెం చినుకులతో చల్లగా ఉంది. అలీగఢ్‌ సమీపంలోని తపాల్‌లో ఉన్న డీడీఎస్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్నారు. 17 ఏళ్ల నెహా శర్మ తరగతి గదిలో కూర్చొని.. తన సమాధానపత్రాన్ని నింపుతోంది. ఇంతలోనే ఓ 18 ఏళ్ల యువకుడు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఏం జరగుతున్నది అంటూ టీచర్, మిగతా ఉపాధ్యాయులు వారి వంక ఆసక్తిగా చూశారు. వారు స్పందించేలోపే ఆ యువకుడు తుపాకీ తీసి నేరుగా నెహా తలకు గురిపెట్టి పేల్చాడు. తూటా తలలోంచి దూసుకుపోవడంతో పరీక్ష రాస్తున్న నేహా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

ఈ షాక్‌లోంచి తేరుకునే లోపే ఆ యువకుడు తనను తాను కాల్చుకున్నాడు. టీచర్ దిగ్భ్రాంతి చెందింది. రక్తపు మడుగులో ఉన్న ఆ ఇద్దరిని చూసి విభ్రమ చెందిన విద్యార్థులు హాహాకారాలు చేస్తూ బయటకు పరిగెత్తారు. గురువారం జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ను కుదిపేస్తున్నది. ఓ యువకుడు డిగ్రీ విద్యార్థినిని తరగతి గదిలోనే కాల్చి చంపి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని 18 ఏళ్ల సందీప్‌ మలాన్‌గా గుర్తించారు. అతను స్థానిక వెటర్నరీ వైద్యుడి కొడుకు. నెహా, సందీప్‌ ఒకరికొకరు తెలుసునని విద్యార్థులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్న పోలీసులు ప్రేమ వ్యవహారం ఇందుకు కారణం కాదని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు