'మాకూ రిజర్వేషన్లు కల్పించండి'

3 Oct, 2015 19:02 IST|Sakshi

వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో రిజర్వేషన్ల డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఓబీసీల  జాబితాలో చేర్చాలంటూ ఇప్పటికే పటేళ్లు ఉద్యమిస్తుండగా.. తాజాగా తమకూ రిజర్వేషన్లు కల్పించాలని బ్రాహ్మణులు డిమాండ్ చేస్తున్నారు.

విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కేటాయించాలని బ్రాహ్మణ సంఘాలు కోరాయి. ఆలయాల్లో పూజారులుగా పనిచేస్తున్నవారికి నెలవారీ వేతనాలు చెల్లించాలని ఆల్ గుజరాత్ బ్రహ్మ్ సమాజ్ డిమాండ్ చేసింది. పటేళ్ల రిజర్వేషన్ల కోసం 21 ఏళ్ల యువకుడు హార్దిక్ పటేల్ ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు