‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం

19 Nov, 2013 01:28 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఆధునీకరించిన ‘బ్రహ్మోస్’ సూపర్‌సోనిక్ క్షిపణిని సోమవారం భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో కొత్త గెడైన్స్ వ్యవస్థను అమర్చిన ‘బ్రహ్మోస్’ బ్లాక్-3 వేరియంట్‌ను ఉదయం 10.55 గంటలకు పరీక్షించారు. క్లిష్టమైన లక్ష్యాలను ఛేదించడంలో చేపట్టిన ఈ పరీక్ష విజయవంతమైందని ‘బ్రహ్మోస్’ అధికారులు తెలిపారు. పరీక్ష కోసం లక్ష్యాలుగా ఏర్పాటు చేసిన కాంక్రీట్ నిర్మాణాలను ఈ క్షిపణి ధ్వంసం చేయగలిగిందని చెప్పారు. ‘బ్రహ్మోస్’ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. తనతో 300 కిలోల బరువు గల సంప్రదాయక ఆయుధాలను మోసుకుపోగలదు. లెఫ్టినెంట్ జనరల్ అమిత్ శర్మ సమక్షంలో ‘బ్రహ్మోస్’ అధికారులు ఈ క్షిపణిని పరీక్షించారు. ఆర్మీ, నేవీలలో ‘బ్రహ్మోస్’ క్షిపణిని ఇప్పటికే ప్రవేశపెట్టారు.   
 

మరిన్ని వార్తలు