చేతులు మారిన బిజినెస్ వరల్డ్ పత్రిక

20 Sep, 2013 00:56 IST|Sakshi

 న్యూఢిల్లీ: బిజినెస్ మ్యాగజీన్‌లలో దేశంలోనే రెండో పురాతన పత్రిక ‘బిజినెస్ వరల్డ్‌‘ను కోల్‌కతాకు చెందిన ఏబీపీ గ్రూప్ విక్రయించింది. అనురాగ్ బాత్రా, విక్రమ్ ఝున్‌ఝున్‌వాలాలు కొనుగోలు చేసినట్లు ఏబీపీ పేర్కొన్నప్పటికీ డీల్ విలువను వెల్లడించలేదు. ఏబీపీ గ్రూప్ ప్రధాన ప్రచురణల్లో బెంగాలీ దినపత్రిక ఆనంద్ బజార్‌తోపాటు, ఇంగ్లీష్ దినపత్రిక ద టెలిగ్రాఫ్ ఉన్నాయి. కాగా, బిజినెస్ వరల్డ్ ప్రచురణను 1981లో మొదలుపెట్టారు.

>
మరిన్ని వార్తలు