'గవర్నర్ గారు శంకుస్థాపనకు రండి'

18 Oct, 2015 19:46 IST|Sakshi

హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్కు సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానపత్రిక అందజేశారు. ఆదివారం రాజ్భవన్కు వెళ్లిన చంద్రబాబు.. గవర్నర్ను ఆహ్వానించారు. అంతకుముందు చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు.

ఈ నెల 22న గుంటూరులో రాజధాని శంకుస్థాపన జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు