అమరావతి శంకుస్థాపన చార్రితక ఘట్టం

9 Oct, 2015 09:37 IST|Sakshi
అమరావతి శంకుస్థాపన చార్రితక ఘట్టం

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన చారిత్రక ఘట్టమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అభివర్ణించారు. అందులో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడలో జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మన రాజధాని, మన మట్టి - మన నీరు అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు.

13న సర్వమత సంప్రదాయాలతో మట్టి తెస్తే... స్మారక స్థూపం నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు.శాప్ ఆధ్వర్యలో నిర్వహించే అమరావతి జ్యోతి ర్యాలీలో పాల్గొన్నాలని యువతకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఊరిలో పండగ వాతావరణం నెలకొనాలి ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు