అమెరికా ఆటో దిగ్గజానికి చైనా షాక్?

14 Dec, 2016 15:23 IST|Sakshi
అమెరికా ఆటో దిగ్గజానికి చైనా షాక్?
షాంఘై : చైనా అనుసరిస్తున్న విధానాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎలాగైనా గట్టి షాకివ్వాలని డ్రాగన్ వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో ఓ అమెరికా ఆటో దిగ్గజానికి త్వరలోనే చైనా భారీ ఫైన్ విధించబోతుందని తెలుస్తోంది. కంపెనీ పేరు వెల్లడించని చైనా డైలీ న్యూస్పేపర్, ఓ అమెరికా ఆటో దిగ్గజం అనుసరిస్తున్న గుత్తాధిపత్య ధోరణికి త్వరలోనే జరిమానా పడుతున్నట్టు వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ అమెరికా కంపెనీ  2014 నుంచి డిస్ట్రీబ్యూటర్లకు ధరలను నిర్ణయిస్తూ వస్తోందని ఇన్వెస్టిగేటర్ల విచారణలో తేలినట్టు చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణ కమిషన్( ఎన్డీఆర్సీ) డైరెక్టర్ ఝాంగ్ హ్యాన్డాంగ్ చెప్పారు.  ఈ జరిమానా విషయంలో ఎవరూ తప్పుడు వార్తకథనాన్ని చదవడం లేదని పేర్కొన్నారు. అయితే ఈ ఆర్టికల్ ఏ కంపెనీకి, ఎంత మొత్తంలో జరిమానా విధించబోతున్నారో పూర్తి వివరాలను వెల్లడించలేదు.
 
ఆటో దిగ్గజాలకు చైనా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అమెరికా ఆటో దిగ్గజాలు జనరల్ మోటార్స్ కంపెనీ, ఫోర్డ్ మోటార్ వంటి కంపెనీలు ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే మీడియా ఊహాగానాలపై తాము స్పందించమని ఈ కంపెనీలు తేల్చేశాయి.  యాంటీ-మోనోపలి ఇన్వెస్టిగ్వేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఆటో దిగ్గజాలకు ఈ ఎన్డీఆర్సీ ఏడో సార్లు  జరిమానా విధించింది. తైవాన్పై ఆధిపత్య ధోరణిగా చైనా అనుసరిస్తున్న 'వన్ చైనా' పాలసీపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన అనంతరం చైనా డైలీ ఈ వార్తాకథనాన్ని ప్రచురించడం గమనార్హం. తైవాన్ను బీజింగ్ తమలో ఒకటిగా భావిస్తోంది. అంతేకాక తైవాన్కు, అమెరికాకు 1979 నుంచి ఎలాంటి దౌత్యసంబంధాలు లేవు. కానీ ట్రంప్ గెలవగానే,  చైనాకు వ్యతిరేకంగా తైవాన్ను మార్చడానికి పలు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.  
మరిన్ని వార్తలు