నౌక బోల్తా: తొమ్మిది మంది గల్లంతు

1 Oct, 2014 10:27 IST|Sakshi

ఒకాసా: జపాన్ సమీపంలో తమ దేశానికి చెందిన నౌక ఒకటి బోల్తా పడిందని చైనా దౌత్య ఉన్నతాధికారి బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఆ నౌకలోని ఐదుగురు సిబ్బందిని రక్షించినట్లు చెప్పారు. మరో తొమ్మిది మంది జాడ మాత్రం తెలియలేదని తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని  చెప్పారు. నౌక ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరిందని జపాన్ను తమ దేశం కోరిందని ఉన్నతాధికారి చెప్పారు.

మరిన్ని వార్తలు