భారత్ మార్కెట్ లో స్మార్ట్‌ఫోన్‌ కొత్త మోడల్‌

12 Jul, 2017 18:29 IST|Sakshi
భారత్ మార్కెట్ లో స్మార్ట్‌ఫోన్‌ కొత్త మోడల్‌

న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌  తయారీదారు షియోమీ మరో కొత్త మోడల్‌ను వచ్చేవారం భారత మార్కట్లో విడుదల చేయనుంది. ఎంఐ మాక్స్2 పేరుతో 6.44 అంగుళాల  డిస్‌ప్లేతో ఓ డివైస్‌ను మార్కట్లోకి తీసుకురానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5300 ఎంఏహెచ్.  ఈ ఫోన్ చైనాలో గత మే నెలలోనే విడుదల చేశారు. దీనిలో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌ ఉంది. రామ్ సామర్థ్యం 4 జీబీ. ఇంటర్నల్ స్టోరేజీ 64/128 జీబీ.

ఈ డివైజ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. దీనిలో 12 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. షియోమీ గత సంవత్సరం ఇండియాలో ఒక బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. అలాగే 2017 సంవత్సరం సెకండ్ క్వార్టర్లో షియోమీ కంపెనీకి చెందిన దాదాపు 2.31 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు  అమ్ముడు పోయాయి.



 

మరిన్ని వార్తలు