చైనా చెరలో ఐదుగురు భారతీయులు

15 Dec, 2013 19:49 IST|Sakshi

చైనా మరోసారి బరితెగించింది. ఈసారి ఏకంగా ఐదుగురు భారతీయులను నిర్బంధంలోకి తీసుకుంది. లడఖ్ ప్రాంతంలోని చుమర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పైపెచ్చు, వాళ్లు భారత భూభాగంలోకి చొరబడి మరీ మనవాళ్లను పట్టుకుపోవడం గమనార్హం. వాస్తవాధీన రేఖ పరిధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి. అయితే, ఈ విషయంలో సైన్యం వెంటనే కలగజేసుకోవడంతో ఐదుగురినీ తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు భారతీయ సైనికులకు అప్పగించాయి.

పశువులను మేపుకొంటున్న ఐదుగురు భారతీయులను పీఎల్ఏ దళాలు భారత భూభాగంలోకి కొన్ని కిలోమీటర్లు లోపలకు వచ్చి మరీ తీసుకెళ్లాయి. ఆ ప్రాంతంపై తమ పట్టు ఉందని చూపించుకోడానికే వాళ్లలా చేసి ఉంటారని అంటున్నారు. అయితే ఈ సంఘటనను సామరస్యపూర్వంగా పరిష్కరించుకున్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు