కోటే కుటుంబానికి ‘చిరు’ సాయం

12 Nov, 2013 06:00 IST|Sakshi
కోటే కుటుంబానికి ‘చిరు’ సాయం

బెంగళూరు: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాద సంఘటనలో సజీవ దహనమైన కోటే వెంకటేశ్ యాదవ్ కుటుంబానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేసింది. బెంగళూరులో సోమవారం నిర్వహించిన కోటే పెద్దకర్మలో నటుడు నాగేంద్రబాబు పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. కోటే అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తమపై చూపిన అభిమానాన్ని మరువలేమన్నారు. వెంకటేశ్ కుమార్తెలు ఇద్దరికి రూ. 3 లక్షలు, వెంకటేశ్ భార్య శాంత, కోటే తండ్రి సుందర్‌రాజ్‌లకు రాంచరణ్, అల్లు అర్జున్ అందించిన రూ. లక్ష డీడీలను అందజేశారు.

మరిన్ని వార్తలు