వాహన రంగ ఉక్కు అవసరాలపై దృష్టి: గెర్డావ్

24 Mar, 2015 01:14 IST|Sakshi
వాహన రంగ ఉక్కు అవసరాలపై దృష్టి: గెర్డావ్

హైదరాబాద్: వాహన, రైల్వే, రక్షణ రంగ సంస్థలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తుల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు గెర్డావ్ ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా తాడిపత్రిలోని తమ ఉక్కు కర్మాగారాన్ని మరింతగా విస్తరిస్తున్నట్లు, త్వరలోనే కోక్ ఓవెన్లను కూడా ప్రారంభిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో దాదాపు 2,000 మంది పనిచేస్తున్నారని, ఇప్పటిదాకా సుమారు రూ. 2,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశామని గెర్డావ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.

>
మరిన్ని వార్తలు