ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ

11 Nov, 2016 17:20 IST|Sakshi
ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కొత్త నోట్లను విత్ డ్రా చేసుకోవడానికి పార్లమెంటు వీధిలోని ఎస్ బీఐ ఏటీఎం వద్దకు వచ్చారు. సాధారణ ప్రజలతో పాటే క్యూ లో వేచి చూశారు. గంటల తరబడి క్యూలో వేచి వున్న చిల్లర బాధితులను ఆయన పరామర్శించారు.