సెల్ఫీ-ఫోకస్డ్ కూల్ప్యాడ్ వచ్చేసింది!

10 Aug, 2016 14:07 IST|Sakshi

కూల్ప్యాడ్ మెగా 2.5డీ సెల్ఫీ-ఫోకస్డ్ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. రూ.6,999లకు ఈ ఫోన్ను ఆవిష్కరిస్తున్నట్టు ఈ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారి తెలిపింది. వివిధ బడ్జెట్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కూల్ప్యాడ్ బుధవారం సెల్ఫీ-ఫోకస్డ్ డివైజ్తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ మొదటి ఫ్లాష్ అమ్మకాలు ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్ఫామ్పై ఆగస్టు 24వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి సాయంత్రం నుంచి ఈ ఫోన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించినున్నట్టు కంపెనీ ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా కింద ఈ ఫోన్ను ఆవిష్కరించినట్టు కూల్ప్యాడ్ తెలిపింది. నేడు లాంచ్ చేసిన కూల్ప్యాడ్ మెగా 2.5డీ, గత నెల చైనాలో ఆవిష్కరించిన కూల్ప్యాడ్ స్కై 3 దాదాపు ఒకే మాదిరిగా ఉన్నాయి. చిన్న చిన్న మార్పులతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.

కూల్ప్యాడ్ మెగా 2.5డీ స్మార్ట్ఫోన్ ఫీచర్లు...

5.5 అంగుళాల హెచ్డీ(720x1280 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ప్లే
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో
4జీ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ
3 జీబీ ర్యామ్
16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ
8 మెగా పిక్సెల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు
డ్యుయల్ సిమ్
2500 ఎంఏహెచ్ బ్యాటరీ
140 గ్రాములు, 7.85ఎంఎం థిక్

>
మరిన్ని వార్తలు