'అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తాం'

19 Apr, 2015 11:26 IST|Sakshi
'అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తాం'

న్యూఢిల్లీ: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో బీజేపీ కార్యగోష్ఠిని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అంతరిక్షం, అణుశక్తి రంగంలో భారత్ తనదైన ముద్ర వేసుకుందని తెలిపారు. కెనడా నుంచి భారత్కు ఐదేళ్ల పాటు యూరేనియం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మోదీ గుర్తు చేశారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశం యెమెన్. ఆ దేశంలోని భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తరలించామని ఆయన వివరించారు. పార్లమెంట్లో బలమైన ప్రతిపక్షం ఉండాలని మోదీ ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు. అవినీతిరహిత భారతదేశాన్ని నిర్మిస్తామని మోదీ ప్రకటించారు.

మరిన్ని వార్తలు