ఆవుదూడకు బారసాల

10 Aug, 2015 18:57 IST|Sakshi

జగిత్యాల అర్బన్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని శక్తిగణేశ్ ఆలయంలో సోమవారం లేగదూడకు బారసాల నిర్వహించారు. శక్తిగణేశ్ ఆలయ పూజారి కర్నె నారాయణశర్మ ఇంట్లోని ఆవుకు ఇటీవల దూడ పుట్టింది.

పుష్కరాల సమయంలో లేగదూడ జన్మించడం మహాపుణ్యమని గోమాతకు పూజలు నిర్వహించడంతో పాటు దూడకు బారసాల నిర్వహించారు. లేగెదూడకు గోదావరి అని నామకరణం చేశారు. అనంతరం బంధుమిత్రులకు అన్నదానం చేశారు.

మరిన్ని వార్తలు