సీపీఎం సీనియర్ కార్యకర్త హత్య

28 Aug, 2015 19:53 IST|Sakshi

కన్నాంఘడ్: కేరళలో సీనియర్ సీపీఐ కార్యకర్తను హత్య చేశారు. ఆయన సోదరుడిని తీవ్రంగా గాయపరిచారు. కాసర్ఘోడ్ జిల్లాలోని కాయకున్ను వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలే ఈ పనిచేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు బలగాలు ఆ చుట్టూపక్కల నిషేదాజ్ఞలు జారీ చేశారు.

దాదాపు 20 ఏళ్లకు పైగా నారాయణన్(45) అనే వ్యక్తి సీపీఎంలో పనిచేస్తుండగా అతడి సోదరుడు అరవిందాన్ కూడా ఆయనతో కలిసిపనిచేస్తున్నాడు. వారిద్దరిపై ఒకేసారి ఓ గ్రూపు దాడికి దిగింది. పదునైన ఆయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేసింది. దీంతో నారాయణన్ అక్కడికక్కడే మృతిచెందగా అరవిందన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, తమపై వచ్చిన ఆరోపణలను బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు కొట్టిపారేశాయి.  
 

మరిన్ని వార్తలు