సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ

10 Sep, 2015 18:49 IST|Sakshi
సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బిజినెస్ టుడే పత్రికలో తన ఫొటోను విష్ణువుగా చిత్రీకరిస్తూ వేసిన కవర్ పేజీ ఫొటో విషయంలో తలెత్తిన వివాదాన్ని సుప్రీం దృష్టికి ధోనీ తీసుకెళ్లాడు. ఈ మేరకు గురువారం ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశాడు. 2013 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనపై ధోనీ అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అలాగే, బెంగళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దుచేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడంతో ఆ అంశంపై కూడా ధోనీ సుప్రీంకోర్టులో మరో ఎస్ఎల్పీ దాఖలు చేశాడు.  ఈ కేసును ఈనెల 14వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

మరిన్ని వార్తలు