హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్లు, టీవీల కారణంగా కళ్లపై ఒత్తిడి పెరిగి వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయని, అందుకే కంటి అలసటకు చెక్ చెప్పేందుకు సరికొత్త లెన్స్ను తయారుచేశామని ఫ్రెంచ్కి చెందిన లెన్స్ తయారీ సంస్థ ఎస్సిలార్ సంస్థ తెలిపింది. ఈ లెన్స్లను క్రిజాల్ యాంటీ ఫాటిగ్ లెన్స్ పేరుతో దేశీయ మార్కెట్లోకి మంగళవారం విడుదల చేసినట్లు ఎస్సిలార్ ఇండియా సీఈఓ శివకుమార్ జే తెలియజేశారు. ఈ లెన్స్ కింది భాగంలో ఉన్న పవర్ బూస్ట్ 50 శాతం మేర కంటి అలసటను దూరం చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.