గ్యాస్ నగదు బదిలీతో 14వేల కోట్ల మిగులు

13 Oct, 2015 09:40 IST|Sakshi

న్యూఢిల్లీ: వంటగ్యాస్ ప్రత్యక్ష నగదు సబ్సిడీ ద్వారా రూ. 14,672 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలిందని కేంద్ర పెట్రోలియం శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

2015 ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో రిజిస్టర్ అయిన వంటగ్యాస్ వినియోగదారులు 18.19 కోట్లు ఉన్నారని.. అందులో 14.85 కోట్ల మంది నిజమైన వినియోగదారులని.. 3.34కోట్ల మంది బోగస్ వినియోగదారులన్నారని ఆ ప్రకటనలో తెలిపింది.
 

మరిన్ని వార్తలు