శతాబ్ది ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి

21 Jul, 2015 21:46 IST|Sakshi
శతాబ్ది ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి

చండీగఢ్: ఢిల్లీ- చండీగఢ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. హర్యానాలోని రతధనా-సోనీపేట రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న రైలుపై రాళ్లతో దాడి జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. దాడిలో రైలు అద్దాలు పగిలిపోయాయన్నారు.

ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రైళ్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సమీప గ్రామాల్లో అధికారులు ప్రచారం చేయించారు.

మరిన్ని వార్తలు