దొంగతో పోట్లాడి.. రైల్లో నుంచి జారిపడ్డ మహిళా బాక్సర్

10 Jan, 2014 12:43 IST|Sakshi

ఢిల్లీకి చెందిన మహిళా బాక్సర్ దొంగను ఎదరించే క్రమంలో రైలును కిందపడి తీవ్రంగా గాయపడింది. ఆమె కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

సిమ్రాన్ వర్మబెనారస్ యూనివర్సిటీలో బాక్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొన్న అనంతరం ఫరక్కా ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి బయల్దేరింది. రైలులో ఓ దొంగ ఆమె హ్యాండ్ బ్యాగ్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. సిమ్రాన్ తన వస్తువుల్నిరక్షించుకునేందుకు అతన్ని ఎదిరించి పోరాడింది. అయితే ఫైజాబాద్ శివారు ప్రాంతంలో ఆమె అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. సిమ్రాన్కు ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం గురువారం రాత్రి న్యూఢిల్లీకి తరలించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. తన  బ్యాగ్లో 30 వేలకుపైగా నగదు ఉన్నట్టు బాక్సర్ తెలిపింది. దొంగ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు