కృత్రిమ దంతవైద్యంలో ఆధునిక పరిజ్ఞానం

22 Sep, 2013 01:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కృత్రిమ దంతాల అమరికలో ఎప్పటికప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నట్టు పార్థా డెంటల్ ఆస్పత్రుల అధినేత డా.పార్థసారథి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దంత వైద్యంపై ఇంకా ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లోని మణికొండలో నేడు పార్థ డెంటల్ క్లినిక్ 22వ బ్రాంచిని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 బ్రాంచీలు ఉన్నాయని, నగరంలో 11 ఉన్నాయని, మణికొండ బ్రాంచి రాకతో సిటీలో ఆస్పత్రుల సంఖ్య 12కు చేరుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 22 అవుతాయని అన్నారు.

మరిన్ని వార్తలు