డెట్రాయిట్‌లో ఐఐఈ ఎక్స్‌పో!

10 Apr, 2015 23:23 IST|Sakshi

తొలిసారిగా ప్రాపర్టీ షో మీడియా పార్ట్‌నర్లుగా సాక్షి, తెలుగు టైమ్స్

హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 20వ సదస్సు జూలై 2 నుంచి 4 వరకు డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో జరగనుంది. తొలిసారిగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్ పో (ఐఐఈ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు ఐఐఈ ఫౌండర్, సీఈఓ రాజేష్ సుకమంచి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సాక్షి, తెలుగు టైమ్స్ మీడియా పార్టనర్లుగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు +919000988068కు ఫోన్ లేదా mail@iiexpo.in కు మెయిల్ చేయవచ్చు.
 
 

మరిన్ని వార్తలు