నేడు ధీరూభాయ్‌కి పద్మవిభూషణ్ ప్రదానం

28 Mar, 2016 01:08 IST|Sakshi
నేడు ధీరూభాయ్‌కి పద్మవిభూషణ్ ప్రదానం

అందుకోనున్న భార్య కోకిలాబెన్

 
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూపు వ్యవస్థాపకుడు, దివంగత ధీరూభాయ్ అంబానీకి కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆయన భార్య కోకిలాబెన్ సోమవారం (నేడు) స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి వారి కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, వారి భార్యలు నీతా, టీనాలతో పాటు కుమార్తెలు నీనా కొఠారి, దీప్తి సల్గావుంకర్ కూడా హాజరుకానున్నారని సమాచారం. అంబానీ మరణించిన 14 ఏళ్ల తర్వాత ఆయనకు పద్మవిభూషణ్ ప్రకటించారు.


కాగా, ధీరూభాయ్‌తో పాటు నిర్మాణ దిగ్గజం పల్లోంజి షాపూర్జి మిస్త్రీ, మారుతి ఉద్యోగ్ చైర్మన్ ఆర్‌సీ భార్గవ, సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ, మాస్టర్ కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ పాల్ ఎస్ బంగలు ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారాలకు ఎంపికైన వారిలో ఉన్నారు.

 

మరిన్ని వార్తలు