భారత్‌లో హక్కుల ఉల్లంఘన: యూఎస్‌

3 Apr, 2017 03:38 IST|Sakshi
భారత్‌లో హక్కుల ఉల్లంఘన: యూఎస్‌

న్యూఢిల్లీ: భారత్‌లో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అమెరికా ప్రభుత్వ నివేదిక విమర్శించింది. సామాజికవేత్త తీస్తా సెతల్వాద్‌పై  కేసు, మధ్యప్రదేశ్‌లో 8 సిమీ కార్యకర్తల కాల్చివేతను నివేదికలో పేర్కొంది. ‘భారత్‌లో మానవ హక్కులు–2016’ నివేదికలో.. ఎన్జీవోలకు విదేశీ నిధులపై ఆంక్షలు,  మహిళలపై నేరాల కేసులను పొందుపరిచింది. 25 స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధులు పొందకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించింది. ఈ ఎన్జీవోలు భారత్‌లో తమ కార్యకలాపాలు నడిపేందుకు భయపడుతున్నాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు