అక్టోబర్ 5 నుంచి మైసూరు దసరా ఉత్సవాలు

11 Aug, 2013 03:45 IST|Sakshi

 సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అక్టోబర్ 5 నుంచి 14 వరకు మైసూరు దసరా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. శనివారం విధాన సౌధలో తన అధ్యక్షతన జరిగిన మైసూరు దసరా ఉత్సవ సమితి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాలకు అవసరమైన రూ.10 కోట్లను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ఇతర పనులకు మరో రూ.5 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు