40 మంది ఆంధ్రప్రదేశ్ యువతులను రక్షించిన సిఐడి

8 Jan, 2014 15:54 IST|Sakshi
వ్యభిచా గృహాలలోని యువతులు (ఫైల్ ఫొటో)

పూణే:  సిఐడి పోలీసులు మహారాష్ట్రలోని పూణేలో వ్యభిచారగృహాలపై దాడి చేసి పలువురు యువతులను రక్షించారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 మంది యువతులు ఉన్నారు. వారికి విముక్తి కల్పించారు.

సీఐడీ ఎస్పి రమణ్‌ కుమార్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. అమ్మాయిలను తరలిస్తున్న 8 మంది నిర్వాహకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యభిచార గృహాలలో మగ్గుతున్న 40 మంది యువతులను హైదరాబాద్ పంపినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు