స్వామి నిత్యానందపై ఫిర్యాదు

4 Jan, 2014 08:38 IST|Sakshi
స్వామి నిత్యానందపై ఫిర్యాదు

చెన్నై:  స్వామి నిత్యానందపై ఓ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యానంద నుంచి ప్రకటన హోర్డింగులకు సంబంధించి రూ.70 లక్షల బాకీ ఇచ్చించాలని కోరుతూ తిరుచెంగోడుకు చెందిన కంప్యూటర్ ఇంజినీరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుచెంగోడు వీరరాఘవ మొదలియార్ వీధికి చెందిన సెంగోట్టువేలు (45) కంప్యూటర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు.  ఫిర్యాదులో పేర్కొన వివరాల్లోకి వెళితే....

బిడది ఆశ్రమానికి చెందిన నిత్యానంద పరమహంసకు 2011 నుంచి ఆధ్యాత్మిక ప్రకటనలు రూపొందించి సీడీల రూపంలో అందచేశానన్నాడు. దీనికి సంబంధించిన చార్జీలు, రాయల్టీ రూ.70 లక్షల వరకు తనకు రావాల్సి ఉందన్నాడు. ఆ డబ్బును నిత్యానంద నుంచి తనకు అందచేయాలని, అంతేకాకుండా తన ప్రకటన సీడీలు ప్రసారం చేయకుండా నిలిపివేయాలని కోరాడు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని, ఇటీవలి తనపై దాడి చేసిన నలుగురు మహిళా సన్యాసులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

>
మరిన్ని వార్తలు