11 ఏళ్ల కూతురిని ప్రేమించాడని.. తలనరికిన తండ్రి

8 Aug, 2014 10:09 IST|Sakshi
11 ఏళ్ల కూతురిని ప్రేమించాడని.. తలనరికిన తండ్రి

బెంగళూరులో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఏడో తరగతి చదువుతున్న తన 11 ఏళ్ల కుమార్తెను ప్రేమించడమే కాక, ఆమెను ఇంట్లోంచి తీసుకెళ్లిపోయిన యువకుడిని ఓ తండ్రి తల నరికి చంపాడు. అంతేకాదు.. మృతదేహాన్ని ఓ గోనెసంచిలో వేసి, స్కూటీపై పెట్టుకుని నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పాతికేళ్ల సాదిక్ పాషా మృతదేహాన్ని గోనెసంచిలో వేసుకుని రియజ్ ఖాన్ నేరుగా కృష్ణరాజపురం పోలీసుస్టేషన్లోకి నడుచుకుంటూ వచ్చారని, రంజాన్ తర్వాతి రోజున తన 11 ఏళ్ల కూతురిని అపహరించినందుకు అతడిని చంపేసినట్లు చెప్పాడని బెంగళూరు తూర్పుమండలం డీసీపీ ఎన్.సతీష్ కుమార్ తెలిపారు. రియాజ్ ఖాన్పై హత్యకేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

బన్నేరుఘట్టలోని సిద్ధాపురంలో రియాజ్ ఖాన్ నివాసముంటున్నాడు. ఆయన కుమార్తె ఏడో తరగతి చదువుతోంది. తాను ఎన్నిసార్లు చెప్పినా పాషా వినిపించుకోలేదని, తన కుమార్తెకు దూరంగా ఉండాలని ఎంత నచ్చజెప్పినా పట్టించుకోలేదని రియాజ్ ఖాన్ పోలీసులకు తెలిపారు. అతగాడి నుంచి దూరంగా ఉండాలని తన ఇల్లు కూడా అక్కడినుంచి మార్చుకున్నానని, అయినా.. రంజాన్ తర్వాతిరోజున తన కూతురిని తీసుకుని పాషా లేచిపోయాడని చెప్పారు.

ఆగస్టు ఒకటోతేదీ వరకు తన కుమార్తె రాకపోవడంతో తొలుత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత తన స్నేహితుల సాయంతో పాషా ఎక్కడున్నదీ తెలుసుకున్నారు. ఇక ఊరుకుంటే వీల్లేదని భావించి, బన్నరఘట్ట ప్రాంతానికి అతడిని తీసుకెళ్లి, గొంతు కోసి, పొడిచి చంపేశారు. ఆ తర్వాత రక్తమోడుతున్న ఆ మృతదేహాన్ని గోనెసంచిలో వేసుకుని తన స్కూటర్ మీద పెట్టుకుని 20 కిలోమీటర్లు ప్రయాణించి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయారు. కాగా, తీవ్రంగా గాయపడ్డ సాధిక్ స్నేహితుడిని స్థానికులు నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

>
మరిన్ని వార్తలు