బడుగుల మురికివాడల్లో భగ్గుమన్న మంటలు

7 Nov, 2016 20:08 IST|Sakshi
బడుగుల మురికివాడల్లో భగ్గుమన్న మంటలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని సదర్‌ బజార్‌ సమీపంలో ఉన్న మురికివాడల్లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కసారిగా ఇక్కడ అగ్నికీలలు ఎగిసిపడటంతో భీతావహ పరిస్థితి నెలకొంది. మంటలు అంతకంతకూ అంటుకుండటంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది.

మొదట 15 ఫైర్‌ టెండర్స్‌ రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఏకంగా 30 ఫైర్‌ టెండర్స్‌ అగ్నికీలలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీ మంటలు, దట్టమైన పొగలతో ఇక్కడి మురికివాడ భీతావహం కనిపిస్తోంది. 
 
 
 
మరిన్ని వార్తలు