మహారాష్ట్రలో కూలిన హెలికాఫ్టర్: ఐదుగురు మృతి

29 Sep, 2013 12:06 IST|Sakshi

మహారాష్ట్రలోని థానే జిల్లాలో టొక్వాని గ్రామీణ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ హెలికాఫ్టర్ కూలింది. ఆ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ముంబయి నుంచి ఔరంగాబాద్ వెళ్తుండగా ఆ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అదికారులు వెల్లడించారు. మృతులను గుర్తించవలసి ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. 

 

హెలికాఫ్టర్ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. హైటెన్షన్ వైర్లు తగిలి హెలికాఫ్టర్ కుప్పకులిందని ఉన్నతాధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు