ప్రియుడిపై మాజీ ప్రియురాలి యాసిడ్ దాడి

16 Oct, 2015 11:27 IST|Sakshi
ప్రియుడిపై మాజీ ప్రియురాలి యాసిడ్ దాడి

తనకు తెలియకుండా మరో యువతితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడన్న కోపంతో.. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. వెంకటేశ్వర్లు అనే యువకుడిపై అతడి మాజీ ప్రియురాలు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వెంకటేశ్వర్లు ముఖంతో పాటు శరీరంపై అనేక చోట్ల కాలిన గాయాలయ్యాయి.

అతడికి గుంటూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారంపై ఎక్కడా కేసు నమోదు కాలేదు. యువకుడి కుటుంబ సభ్యులు కూడా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసి పోలీసులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా, అక్కడ బాధితుడు కనిపించలేదు.

మరిన్ని వార్తలు