చంద్రబాబును కలిసిన మోహన్బాబు

10 Sep, 2016 22:38 IST|Sakshi

హైదరాబాద్: విలక్షణ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు శనివారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. లేక్ వ్యూ క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసిన మోహన్ బాబు వెంట ఆయన కుమార్తె మంచు లక్ష్మి కూడా ఉన్నారు.

ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయే అని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మోహన్ బాబు అన్నారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్ బాబు చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు