నేపాల్ మాజీ ప్రధాని కన్నుమూత

16 Apr, 2015 15:09 IST|Sakshi
నేపాల్ మాజీ ప్రధాని కన్నుమూత

గుర్గావ్: నేపాల్ మాజీ ప్రధాని సూర్య భహదూర్ తపా(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం ఇక్కడ మెదాంతాలోని మెడిసిటీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఐదుసార్లు ప్రధానిగా పనిచేసిన ఆయన గత మార్చి 29 నుంచి ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. లివర్, కడుపులోని అంతరవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆయన తిరిగి కోలుకోలేకపోయారు. కాగా, ప్రధాని నరేంద్రమోదీ సూర్య భహదూర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి తన నివాళిని ప్రకటించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

>
మరిన్ని వార్తలు