నాటు వేస్తుండగా నలుగుర్ని కాటేసిన పాము

19 Aug, 2015 17:45 IST|Sakshi

ఆదిలాబాద్(లక్సెట్టిపేట): లక్సెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బుధవారం ఓ పాము నలుగుర్ని కాటేసింది. గ్రామానికి చెందిన అక్కల రాజయ్య అనే రైతు పొలంలో నాటు వేస్తుండగా మల్లమ్మ, శాంత, సునీత, రాజవ్వ అనే నలుగురిని వెను వెంటనే కాటేసింది. బాధిత మహిళలను చికిత్సనిమిత్తం హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడా ఉంది.

మరిన్ని వార్తలు