భారీ కెరటం.. జీపును లాక్కెళ్లింది!

18 May, 2015 17:38 IST|Sakshi
భారీ కెరటం.. జీపును లాక్కెళ్లింది!

సముద్రంలో కెరటాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ భారీ కెరటం వచ్చి.. ఏకంగా ఓ జీపును తీరం నుంచి 3500 అడుగులు లోపలకు లాక్కెళ్లిపోయింది. జీపులతో సహా పలు రకాల వాహనాలను అమ్మే కంపెనీకి చెందిన ముగ్గురు యువకులు.. ఓ యాడ్ షూటింగ్ కోసం అక్కడ ఫొటోలు తీసుకుంటున్నారు. సూర్యాస్తమయం సమయంలో అక్కడ స్టంట్ ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని కూడా కంపెనీ ఆ ముగ్గురికీ చెప్పింది.

దాంతో వాళ్లు సముద్రతీరంలో జీపు పార్కింగ్ చేసి, ఫొటోలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి భారీ కెరటం వస్తున్న విషయాన్ని వాళ్లు గమనించుకోలేదు. ఈలోపే కెరటం వచ్చి ఆ జీపును లాక్కెళ్లిపోయింది.  ప్రమాదాన్ని చివరి నిమిషంలో పసిగట్టిన ఆ యువకులు.. వెంటనే తీరంవైపు పరుగులు తీశారు. క్రేనుతో జీపును బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు