మోడీతో గోవా సీఎం భేటీ

10 Jun, 2014 13:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం కలిశారు. ఇది మర్యాదకపూర్వక భేటీ అని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 7 రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో మోడీతో మనోహర్ పారికర్ సమావేశమయ్యారని ట్విటర్ లో పీఎంఓ వెల్లడించింది.

మోడీ, పారికర్ కలిసున్న ఫోటోలను ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని పారికర్ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
 

>
మరిన్ని వార్తలు