గో ఎయిర్ టికెట్లపై రూ.888 డిస్కౌంట్

5 Nov, 2013 00:53 IST|Sakshi

ముంబై: గోఎయిర్ కంపెనీ అన్ని విమాన టికెట్లపై రూ.888 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా రానున్న ఎనిమిది రోజుల్లో బుక్ చేసుకునే టికెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని కంపెనీ సోమవారం తెలిపింది. వచ్చే నెల 20 వరకూ జరిగే ప్రయాణాలకు ఈ డిస్కౌంట్‌ను అందిస్తామని పేర్కొంది.  ఈ సంస్థ 21 నగరాలకు వారానికి మొత్తం 840 విమాన సర్వీసులను నడుపుతోంది. 2005, నవంబర్ 4న సర్వీసులను ప్రారంభించిన ఈ సంస్థ అహ్మదాబాద్, బగ్‌దోగ్ర, బెంగళూర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, జైపూర్, జమ్మూ, కోచి, కోల్‌కత, లెహ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పోర్ట్‌బ్లైర్, పుణే, రాంచి, శ్రీనగర్‌లకు విమాన సర్వీసులందిస్తోంది.

మరిన్ని వార్తలు