ఏకాభిప్రాయంతోనే ఎయిరిండియా ప్రైవేటీకరణ

8 Oct, 2013 01:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కాస్త వెనక్కి తగ్గిన పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ మరో రాగం ఎత్తుకున్నారు. రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం ద్వారానే సంస్థను ప్రైవేటీకరించాలని చెప్పారు. ప్రస్తుతానికైతే మాత్రం ఎయిరిండియా ప్రైవేటీకరణ అంశాన్నైతే పరిశీలనలో లేదని, అయితే, భవిష్యత్‌లో ఏదో ఒక రోజు మాత్రం ఇలా చేయడం తప్పదని, ఇందుకోసం రాజకీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు