ఏపీ ఎక్స్ప్రెస్ లో కాల్పులు; ముగ్గురు మృతి

5 Dec, 2013 22:01 IST|Sakshi

ఆగ్రా: ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలోని చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఎస్‌-6 బోగీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు.

కాల్పులకు కారణాలు వెంటనే తెలియ రాలేదు. సమాచారం తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు