హర్షకుమార్ అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

12 Jul, 2015 19:35 IST|Sakshi

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.

క్రైస్తవులకు శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలంటూ హర్షకుమార్ ఆమరణ దీక్షకు దిగారు. కాగా శనివారం సాయంత్రం హర్షకుమార్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు వెంటనే స్పందించి హర్షకుమార్ చేతిలో ని తుపాకీని లాక్కొని ఆయనను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనను ఆరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

మరిన్ని వార్తలు