మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి

4 Sep, 2017 20:48 IST|Sakshi
మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి

చెన్నై: బేకరీలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ మరుగుతున్న పాల పాత్రలో పడి మృతి చెందాడు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. హోసూర్‌లోని చినఎలసగిరికి చెందిన  మురుగేష్‌ (30) బేకరీ నిర్వహిస్తుంటాడు. అతని కుమారుడు భవుస్యాకు మూడేళ్లు.

ఆగస్టు 30వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో బేకరీలో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆ బాలుడు అనుకోకుండా పక్కనే ఉన్న మరుగుతున్న పాల పాత్రలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన భవుస్యాని చికిత్స కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి భవుస్యా ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు