అధికారులతో నాయకులకు శిక్షణా?

2 May, 2015 17:45 IST|Sakshi
అధికారులతో నాయకులకు శిక్షణా?

పార్టీలకు అతీతంగా ఉండే అధికారులతో రాజకీయ నాయకులకు శిక్షణ పాఠాలు ఎలా చెప్పిస్తారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు అవినీతి కేసుల్లో, కుంభకోణాల్లో ఉన్నారని, అలాంటి వాళ్లకు ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డితో పాఠాలు చెప్పించడం సబబేనా అని ఆయన ప్రశ్నించారు.

లోక్సభలో గానీ, అసెంబ్లీలో గానీ ఉన్న సభ్యుల్లో 15 శాతం మంది కంటే ఎక్కువ మంది మంత్రులుగా ఉండేందుకు వీల్లేదని ఆయన చెప్పారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం చెల్లదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు