శివాలయంలో హుండీ చోరీ

4 Oct, 2015 11:59 IST|Sakshi

నల్గొండ(భువనగిరి అర్బన్): భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలోని శివాలయంలో దోపిడీ జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకున్నారు. హుండీలో రూ.10 వేల నగదు ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు