వై-ఫై నగరంగా హైదరాబాద్‌: కేటీఆర్

26 Aug, 2014 18:10 IST|Sakshi
వై-ఫై నగరంగా హైదరాబాద్‌: కేటీఆర్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టుకల్లా అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, సమాచార సాంకేతికశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. 24 వందల గ్రామపంచాయితీలను ఈ-పంచాయితీలుగా మారుస్తున్నామని చెప్పారు. పెన్షన్లను ఈ-పంచాయితీలలో ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

హైదరాబాద్‌ను వై-ఫై నగరంగా మారుస్తామని అన్నారు. తమ రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.  సమస్యలను సాధ్యమైనంత తర్వలో వాటిని అధిగమిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు