పాన్‌తో ఆధార్‌ అనుసంధానికి కొత్త లింక్‌

11 May, 2017 18:19 IST|Sakshi
పాన్‌తో ఆధార్‌ అనుసంధానికి కొత్త లింక్‌

న్యూఢిల్లీ: పాన్‌ కార్డుతో ఆధార్‌  నెంబర్‌ అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ కొత్త వెసులుబాటును (ఇ-ఫెసిలిటీ)  గురువారం ప్రారంభించింది.  సంస్థ వెబ్‌ సైట్‌ లో https://incometaxindiaefiling.gov.in/  పేరుతో కొత్త లింక్‌ను లాంచ్‌ చేసింది.   ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి  పాన్‌ నెంబరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో  ఈ సదుపాయాన్ని ప్రారంభించింది.  పాన్‌ తో ఆధార్‌  అనుసంధాన  ప్రక్రియను మరింత సులభం చేస్తూ ఆదాయ  పన్నుశాఖ  ఇ-ఫైలింగ్ వెబ్ సైట్  లో  ఈ కొత్త లింక్‌ను  పొందు పర్చింది.  ఒక వ్యక్తి యొక్క రెండు ప్రత్యేక గుర్తింపులను  (పాన్‌, ఆధార్‌ ​) అనుసంధానించటానికి  హోం పేజ్‌లో దీన్ని  సృష్టించింది. అయితే  పాన్, ఆధార్ లలో  నమోదు చేసిన వివరాలు  ఒకేలా ఉండాలని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది.   

యుఐడిఎఐ (ఇండిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుండి వెరిఫికేషన్ తర్వాత,  ఈ లింక్‌  ధృవీకరిస్తుందని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ఐటీ ఈ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో  లాగిన్‌ అవసరం లేకుండానే ఎవరైనా ఈ లింక్‌ ద్వారా ఆధార్‌, పాన్‌ నంబర్లను అనుసంధానించుకోవచ్చని  తెలిపింది. అలాగే పాన్, ఆధార్‌ కార్డులలో డేట్‌ ఆఫ్‌బర్త్‌, జెండర్‌ తదితర వివరాలు  సరిపోలాల్సి ఉంటుందని  తెలిపింది.   ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం  రిజిస్టర్డ్‌ మొబైల్‌కు  ఓటీపీ(వన్‌టైం పాస్‌వర్డ్‌)   లేదా ఈ మెయిల్‌   పంపుతామని చెప్పింది. ఆర్థిక చట్టం 2017 ప్రకారం  ఐటీఆర్‌ దాఖలుకు ఆధార్‌ తప్పనిసరి. అలాగే పాన్‌ దరఖాస్తుకు ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరి అనే నిబంధన 2017 జూలై నుంచి   అమలుకానుంది.
 

మరిన్ని వార్తలు